News March 9, 2025
NZB: పాఠ్యాంశంగా రమేశ్ కార్తీక్ నాయక్ కవి పద్యం

నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్ ఆంగ్లంలో రాసిన’లైఫ్ ఆన్ పేపర్ ‘అనే కవితను బళ్ళారి (కర్ణాటక) శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో భాగంగా ఇంగ్లిష్ – మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్లో పాఠ్యాంశంగా పొందుపరిచింది. ఇది ఒక గాఢమైన భావోద్వేగ కవిత అని దీనిని పాఠ్యాంశంగా చేర్చడం పట్ల కార్తీక్ హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 23, 2025
మూడు కార్పొరేషన్లుగా మహానగరం..!

GHMCలో మున్సిపాలిటీల విలీనం అనంతరం మహానగరం 300 డివిజన్లకు పెరిగింది. అయితే ఇంత పెద్ద నగరానికి ఒకే కార్పొరేషన్ ఉండాలా లేక విభజించాలా అనే విషయాన్ని సర్కారు ఆలోచిస్తోంది. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
News December 23, 2025
GNT: పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన రద్దు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన అనూహ్యంగా రద్దైంది. నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఆయన పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయినట్లు స్థానిక జనసేన నేతలు వెల్లడించారు. గతంలో ఇక్కడ పర్యటించినప్పుడు ఇండ్ల నాగేశ్వరమ్మ అనే మహిళకు మళ్లీ వస్తానని పవన్ మాటిచ్చారు. ఆయన రాక కోసం ఎదురుచూసిన గ్రామస్థులు, పర్యటన రద్దవడంతో నిరాశ చెందారు.
News December 23, 2025
అనంత: జగన్ బర్త్డే వేడుకలపై నెట్టింట హీట్

YCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలను ఈనెల 21న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అయితే కళ్యాణదుర్గం(M) బొమ్మగానిపల్లి, కనగానపల్లి(M) భానుకోట, విడనపకల్లు(M)లో మేకలు, గొర్రెలను బలిచ్చి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు మాత్రం తమ నేతపై అపారమైన అభిమానాన్ని ఇలా వ్యక్తపరిచామని సమర్థిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? కామెంట్.


