News April 12, 2024

NZB: పోలీసుల తనిఖీల్లో రూ. 7,21,587 నగదు పట్టివేత

image

నిజామాబాద్ నగరంలో పోలీసులు శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో పెద్దమొత్తంలో నగదు సీజ్ చేశారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యంలో ఎల్లమ్మగుట్ట సమీపంలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి సరైన పత్రాలు చూపకుండా తరలిస్తున్న రూ. 7,21,587 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్నికల గ్రీవెన్స్ కమిటీకి నగదును అందజేశారు. ఈ తనిఖీల్లో నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్, ఏఎస్సై రామకృష్ణ, సిబ్బంది రమేష్, అనిల్, మనోజ్ పాల్గొన్నారు.

Similar News

News September 30, 2024

నిజామాబాద్‌లో 8,30,580 ఓటర్లు ఉన్నారు..!

image

నిజామాబాద్ జిల్లాలో 27 మండలాలు ఉండగా 545 గ్రామపంచాయతీలో 5022 వార్డులు ఉన్నాయి. జిల్లా మొత్తంలో 8,30,580 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 4,43,548 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 3,87,017 మంది పురుషులు, 15 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో పంచాయతీ ఎన్నికల్లో వారు కీలకంగా మారనున్నారు.

News September 30, 2024

నిజామాబాద్: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
కామారెడ్డి 3560 272 1:13
నిజామాబాద్ 3204 285 1:11

News September 30, 2024

రేపు కామారెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

image

కామారెడ్డి: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1వ తేదీ మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పారు. స్థానిక కొత్త బస్టాండ్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం పట్టణంలోని తిలక్ రోడ్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నా తర్వత రాజారెడ్డి గార్డెన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారన్నారు.