News January 11, 2025

NZB: ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇన్‌ఛార్జ్ CP

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇన్‌ఛార్జ్ సీపీ సింధూ శర్మ శనివారం ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాది అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవడం మన అందరి సాంప్రదాయమన్నారు. ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవనము గడపాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా సోదరభావంతో మెలగాలని కోరుకున్నారు.

Similar News

News January 23, 2025

NZB: జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించాలి: డీఈవో

image

ఈ నెల 25న జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించాలని డీఇఓ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదర్శనలు, జాతీయ ఓటర్ ప్రతిజ్ఞ, విద్యార్థుల ర్యాలీ, ఎస్సే రైటింగ్, క్విజ్ తదితర పోటీలను విద్యార్థులకు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

News January 23, 2025

నవీపేటలో బోల్తా పడిన స్కూల్ బస్సు

image

మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. నవీపేటకు చెందిన స్కూల్ బస్సు గురువారం ఉదయం పిల్లలను నాడాపూర్‌లో ఎక్కించుకొని వెళుతుండగా కమలాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కాగా బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News January 23, 2025

రామారెడ్డి: హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

image

హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు KMR అదనపు SP చైతన్య రెడ్డి తెలిపారు. రామారెడ్డి మండలం అన్నారానికి చెందిన పొక్కిలి రవి(41)ని అతడి అన్న కిష్టయ్యా ఈనెల 19న హత్య చేయించాడు. వారి మధ్య భూతగాదాలు ఉండటంతో కిష్టయ్య, అతడి భార్య సత్తవ్వ, కుమారుడు కిషన్ కలిసి షేక్ అఫీజ్, నరేశ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. కేసు నమోదు చేసిన రామారెడ్డి SI నరేష్ వారిని అరెస్టు చేశారు.