News February 4, 2025
NZB: ప్రజావాణికి 141 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్ అర్జీలు అందజేశారు.
Similar News
News January 7, 2026
నిజామాబాద్ అంగన్వాడీల్లో నియామకాల జాప్యం..!

నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీల్లో నియామకాల జాప్యం సాగుతోంది. జిల్లాలో 1,501 ప్రధాన కేంద్రాలతోపాటు 135 మినీ కేంద్రాలను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసినప్పటికీ, ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 76 టీచర్, 400 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఖాళీలను భర్తీ చేయాలని అటు సిబ్బంది, ఇటు లబ్ధిదారులు కోరుతున్నారు.
News January 6, 2026
NZB: నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులతో సీపీ సాయి చైతన్య సమీక్ష నిర్వహించారు. CMR కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలపై నిఘా పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు, స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలన్నారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్లలోని పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి, శాంతిభద్రతలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
News January 6, 2026
ఓటర్ జాబితా సవరణలో పారదర్శకత ఉండాలి: NZB కలెక్టర్

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. అర్బన్ పరిధిలోని 301 పోలింగ్ కేంద్రాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జాబితా రూపొందించాలన్నారు.


