News March 15, 2025

NZB: ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోంది: కవిత

image

అసెంబ్లీలో మా సభ్యులను సస్పెండ్ చేయడం.. మండలిలో మా మీద ఆన్ పార్లమెంటరి వర్డ్స్ వాడటం చుస్తే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతోందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మండలి మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. శాసనమండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కక్ష సాధిస్తున్నారన్నారు.

Similar News

News November 15, 2025

NZB: ప్రభుత్వ సలహాదారుని కలిసిన ఉద్యోగ సంఘాలు

image

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి శనివారం వచ్చిన బోధన్ MLA సుదర్శన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి నేతృత్వంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

News November 15, 2025

నిజామాబాద్: తెలంగాణ జాగృతిలోకి చేరికలు

image

నిజామాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి తెలంగాణ జాగృతిలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుండ్ర నరేష్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలోకి చేరారు. ఆయన మాట్లాడుతూ.. జనంబాట కార్యక్రమానికి ఆకర్షితులై జాగృతిలోకి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జాగృతి అడ్ హక్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

News November 15, 2025

NZB: 17న జరిగే పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయండి

image

ఈనెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రతినిధులు కోరారు. శనివారం వారు 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్ల బకాయిల సత్వర చెల్లింపులు డిమాండ్ చేస్తూ జేఏసీ పిలుపు మేరకు జరిపే ధర్నా కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. శ్రీధర్, నర్సింహస్వామి, బన్సీలాల్ పాల్గొన్నారు.