News February 8, 2025
NZB: ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు మెరుగుపర్చాలి: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన HMలు, MEOల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, ఉపాధ్యాయ వృత్తికి సార్ధకత చేకూర్చినవారవుతారని హితవు పలికారు.
Similar News
News March 20, 2025
NZB: ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం

యువ శాస్త్రవేత్తలకు ఇస్రో ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఈ సారి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ నెల 23వ తేదీలోగా www.isro.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
News March 20, 2025
NZB: జిల్లా బాలికలకు ఫుట్బాల్ ఛాంపియన్షిప్

తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా బాలికల జట్టు ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా వనపర్తి జిల్లాలో జరిగిన అండర్ 14 బాలికల రాష్ట్రస్థాయి పోటీల్లో ఫైనల్ మ్యాచ్లో నిజామాబాద్, ఆదిలాబాద్ జట్లు తలపడ్డాయి. ఇందులో జిల్లా జట్టు 2-0 గోల్ తేడాతో విజయం సాధించింది.
News March 20, 2025
NZB: ధాన్యం సేకరణ సజావుగా కొనసాగాలి: కలెక్టర్

యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బుధవారం అధికారులతో జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.