News April 5, 2024

NZB: ఫోర్జరీ కేసులో ఉద్యోగి సస్పెండ్

image

సంతకం ఫోర్జరీ కేసులో గురువారం సదరు ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు. NZBలోని కిసాన్ సాగర్‌ PHCలో పనిచేస్తున్న జూ.అసిస్టెంట్ శ్రీనివాస్‌కు జక్రాన్‌పల్లి PHC ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఇద్దరు ఉద్యోగులకు GPF ఇప్పించే క్రమంలో పలు పత్రాలపై వైద్యాధికారి రవీందర్ సంతకం ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని ఆయన 20 రోజుల క్రితం జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు.

Similar News

News November 22, 2025

NZB: ఇద్దరు SIలకు VRకు బదిలీ

image

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన బదిలీల్లో ఇద్దరు SIలకు VRకు బదిలీ చేసి అంతలోనే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ పేరిట మళ్లీ స్టేషన్లకు అటాచ్ చేశారు. ఇందులో భాగంగా NZBరూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ-1గా పని చేసిన మహమ్మద్ ఆరిఫ్‌ను డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు, నవీపేట ఎస్ఐగా పనిచేస్తున్న వినయ్‌ను నిజామాబాద్ 6వ టౌన్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 21, 2025

TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

image

TU పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.

News November 21, 2025

NZB: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి: TWJF

image

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని TWJF నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రాల్లోని విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. దాడుల నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రామచందర్ రెడ్డి, రాజు, పరమేశ్వర్, భాస్కర్, ప్రవీణ్, అనిత తదితరులు పాల్గొన్నారు.