News January 16, 2025

NZB: బస్తీ దవాఖానాలను తనిఖీ చేసిన DMHO

image

ఖానాపూర్, నాగారం బస్తీ దవాఖానాలను బుధవారం జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని ఇతర వైద్య సేవలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ.. ప్రతి ఆశ కార్యకర్త డ్యూలిస్టును మెయింటైన్ చేస్తూ ఒకరోజు ముందే టీకాలు ఎవరికి ఇవ్వాలో వారిని బస్తీ దవాఖానాలకు వచ్చేలా చూడాలన్నారు. 

Similar News

News November 24, 2025

నిజామాబాద్: స్థానిక పోరుకు సిద్ధమా..!

image

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. తాజాగా నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని 31 మండలాల్లోని 545 GPలు, 5022 వార్డులు, 5053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.

News November 23, 2025

NZB: పల్లెల్లో టెన్షన్ టెన్షన్.. రిజర్వేషన్లు మారితే..!

image

గ్రామ పంచాయితీ రిజర్వేషన్లు నేడు ఖరారు కానున్నాయి. మళ్లీ పల్లెల్లో సందడి, టెన్షన్ కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కలతో సర్పంచి స్థానాలకు ఆర్డీవోలు, కులగణనతో వార్డులకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 50 శాతం రిజర్వేషన్లు మించకుండా BC, SC, STలకు కేటాయిస్తారు. ఆపై మహిళలకు 50 శాతం స్థానాలు లక్కీ డ్రా తీస్తారు. రిజర్వేషన్లు మారితే లీడర్లు తమ భార్యలు, తల్లులను బరిలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు.

News November 23, 2025

SRSPకి భారీగా తగ్గిపోయిన ఇన్ ఫ్లో

image

SRSPలోకి ఇన్ ఫ్లో భారీగా తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం తెలిపారు. సరస్వతీ కెనాల్‌కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వదిలామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.