News April 15, 2024
NZB: బీజేపీలో చేరిన తొలి ఉద్యమకారుడు
తెలంగాణ తొలి ఉద్యమకారుడు అతిమాముల రమేష్ గుప్తా ఆదివారం జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు, ఇటీవల BRSకి రాజీనామా చేసిన రమేష్ గుప్తా, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే KVR, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, యెండల లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Similar News
News September 30, 2024
నిజామాబాద్లో 8,30,580 ఓటర్లు ఉన్నారు..!
నిజామాబాద్ జిల్లాలో 27 మండలాలు ఉండగా 545 గ్రామపంచాయతీలో 5022 వార్డులు ఉన్నాయి. జిల్లా మొత్తంలో 8,30,580 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 4,43,548 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 3,87,017 మంది పురుషులు, 15 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో పంచాయతీ ఎన్నికల్లో వారు కీలకంగా మారనున్నారు.
News September 30, 2024
నిజామాబాద్: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
కామారెడ్డి 3560 272 1:13
నిజామాబాద్ 3204 285 1:11
News September 30, 2024
రేపు కామారెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
కామారెడ్డి: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1వ తేదీ మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పారు. స్థానిక కొత్త బస్టాండ్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం పట్టణంలోని తిలక్ రోడ్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నా తర్వత రాజారెడ్డి గార్డెన్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారన్నారు.