News April 6, 2024

NZB: భానుడి భగ భగ.. అత్యధికంగా ఇక్కడే

image

ఉమ్మడి NZB జిల్లా రోజు రోజుకు నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మధ్యాహ్నం వేళ జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు NZB జిల్లా డిచ్పల్లి (మం) కొరట్పల్లిలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. KMR జిల్లా నిజాంసాగర్ (మం) హాసన్ పల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

Similar News

News October 14, 2025

SRSP అప్డేట్.. 4గేట్ల ద్వారా నీటి విడుదల

image

SRSP ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 22,290 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాకతీయకు 5000, ఎస్కేప్ గేట్లు (రివర్) 3000, సరస్వతి కాలువ 650, లక్ష్మి 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు తగ్గుతోంది. నీటిమట్టం 1091 అడుగులు కాగా 80.501TMC నీరు ఉంది.

News October 14, 2025

NZB: ఈనెల 21 నుంచి పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాలు

image

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 21 నుంచి 31 వరకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని స్మరించుకున్నారు. వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

News October 14, 2025

నిజామాబాద్: సవాలుగా మారిన బంగారం చోరీ కేసు

image

ఇందల్వాయి మండలం లింగాపూర్‌లో దుర్గాదేవి నవరాత్రుల సమయంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అపర్ణ పూజా కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడి 8 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగలు అపహరించారు. సోమవారం బాధితురాలు సీపీ సాయి చైతన్యకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు.