News June 11, 2024
NZB: భార్యతో గొడవ.. మనస్తాపానికి గురై వ్యక్తి సూసైడ్

భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురై భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్లో జరిగింది. వినాయక్ నగర్కు చెందిన మహమ్మద్ అన్వర్కు భార్యతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అన్వర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 4వ టౌన్ ఎస్ఐ సంజీవ్ తెలిపారు.
Similar News
News December 17, 2025
నిజామాబాద్ జిల్లాలో 54.69 శాతం పోలింగ్

తుది దశ GP ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 12 మండలాల్లోని 165 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
*ఆలూర్ మండలంలో 56.96%
*ఆర్మూర్ – 56.64 %
*బాల్కొండ – 49.08%
*భీంగల్ -58.68 %
* డొంకేశ్వర్ -56.62 %
*కమ్మర్పల్లి -52.96 %
* మెండోరా -58.14 %
* మోర్తాడ్ -51.48 %
*ముప్కాల్ – 52.77%
*నందిపేట్ – 55.41%
*వేల్పూర్ – 51.48%
*ఏర్గట్ల – 55.45%
పోలింగ్ నమోదైంది.
News December 17, 2025
NZB: 9 గంటల వరకు 23.35 శాతం పోలింగ్

తుది దశ GP ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 12 మండలాల్లోని 165 GPల్లో 146 SPలకు, 1130 WM లకు నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
* ఆలూర్ మండలంలో 25.63%,
*ఆర్మూర్ – 26.32%
*బాల్కొండ – 23.04%
*భీంగల్ -24.92%
* డొంకేశ్వర్ – 20.58%
*కమ్మర్పల్లి – 22.12%
* మెండోరా –28.11%
* మోర్తాడ్ – 21.46%
*ముప్కాల్ – 21.06 %
*నందిపేట్ -24.34 %
*వేల్పూర్ – 17.66 %
*ఏర్గట్ల -24.82 %
పోలింగ్ నమోదైనట్లు చెప్పారు.
News December 17, 2025
NZB:తుది దశ GPఎన్నికల్లో ఏకగ్రీవమైన సర్పంచుల వివరాలు

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్కు సంబంధించి ఇప్పటికే 19 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా గెలుపొందారు. మండలాల వారీగా సర్పంచి గా గెలుపొందిన వారి సంఖ్యా వివరాలు ఇలా…
కమ్మర్పల్లి-1,
మోర్తాడ్-1,
భీమ్గల్-4,
వేల్పూర్-4,
ముప్కాల్-1,
ఏర్గట్ల-3,
ఆర్మూర్-1,
ఆలూర్-3,
డొంకేశ్వర్-1


