News June 11, 2024
NZB: భార్యతో గొడవ.. మనస్తాపానికి గురై వ్యక్తి సూసైడ్
భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురై భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్లో జరిగింది. వినాయక్ నగర్కు చెందిన మహమ్మద్ అన్వర్కు భార్యతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అన్వర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 4వ టౌన్ ఎస్ఐ సంజీవ్ తెలిపారు.
Similar News
News October 4, 2024
పిట్లం: ఇంటి నుంచి వెళ్లి చెరువులో శవమై తేలాడు..!
ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో శవమై కనిపించాడు. స్థానికుల వివరాలిలా..పిట్లం గ్రామానికి చెందిన జంగం విఠల్ గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. వెళ్లిన అతను రాక పోయేసరికి కుటుంబీకులు ఎక్కడ వెతికినా జాడ లేదు. శుక్రవారం మారేడు చెరువు వైపు వెళ్లే వారికి చెరువులో విఠల్ శవం తేలియాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకొని శవాన్ని బయటకు తీశారు.
News October 4, 2024
CM రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు: నిఖత్ జరీన్
TG పోలీసు శాఖలో DSP పదవితో సత్కరించినందుకు CM రేవంత్ రెడ్డికి బాక్సర్ నిఖత్ జరీన్ ‘X’ వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాఠీని అందుకున్న ఫోటోలను జత చేసిన ఆమె.. క్రీడలు తనకు మంచి వేదికను అందించాయని తెలిపారు. ఆ స్ఫూర్తి తనకు మరింత సామర్థ్యంతో సేవ చేయడానికి అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది తన విజయం మాత్రమే కాదని సమిష్ఠి విజయమని పోస్టు చేశారు.
News October 4, 2024
NZB: నేడు నగరానికి రానున్న TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నూతన TPCC అధ్యక్షునిగా నియమింపబడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం మొదటిసారి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సభలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.