News March 8, 2025

NZB: భిక్షాటన పేరుతో వచ్చి.. మెడలో గొలుసు చోరీ

image

భిక్షాటన పేరుతో ఇంట్లోకి చొరబడ్డ ఓ మహిళా ఇంట్లోని వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన నిజామాబాద్ మండలం గుండారంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి లక్ష్మి (70) తన ఇంట్లో ఉండగా గుర్తు తెలియని ఓ మహిళా బిక్షాటన >పేరుతొ లక్ష్మి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేక పోవడంతో ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల గొలుసును లాక్కొని పారిపోయింది. బాధితురాలు నిజామాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిం

Similar News

News December 17, 2025

గద్వాల్: ముగిసిన పోలింగ్.. ఫలితాలపై ఉత్కంఠ

image

జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ బుధవారం మానవపాడు మండలం జల్లాపురం, బోరవెల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానున్నది. ఫలితాలపై సర్పంచ్ అభ్యర్థులో ఉత్కంఠ నెలకొంది.

News December 17, 2025

పెద్దపల్లి: పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి డీసీపీ భద్రతా సూచనలు

image

ఓదెల, సుల్తానాబాద్, పెద్దపల్లి, ఎలిగేడు మండలాల్లో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఆవాంఛనీయ సంఘటనలు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేందుకు సిబ్బందికి సూచనలు చేశారు. ప్రత్యేక బృందాలు, పెట్రోలింగ్ వాహనాలు శాంతి భద్రతను పర్యవేక్షిస్తున్నమన్నారు.

News December 17, 2025

రబీ సీజన్.. అందుబాటులో 2 లక్షల మె.టన్నుల యూరియా

image

AP: రబీ సీజన్‌కు రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 2.01 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడించింది. ప్రతి జిల్లాలో 21 రోజులకు సరిపడా యూరియాను బఫర్ స్టాకుగా ఉంచుకోవాలని, 2 రోజులకు ఒకసారి యూరియా నిల్వలపై మీడియాకు సమాచారం అందించాలని, రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకులు మనజీర్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు.