News March 8, 2025
NZB: భిక్షాటన పేరుతో వచ్చి.. మెడలో గొలుసు చోరీ

భిక్షాటన పేరుతో ఇంట్లోకి చొరబడ్డ ఓ మహిళా ఇంట్లోని వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన నిజామాబాద్ మండలం గుండారంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి లక్ష్మి (70) తన ఇంట్లో ఉండగా గుర్తు తెలియని ఓ మహిళా బిక్షాటన >పేరుతొ లక్ష్మి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేక పోవడంతో ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల గొలుసును లాక్కొని పారిపోయింది. బాధితురాలు నిజామాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిం
Similar News
News March 15, 2026
MBNR: మొబైల్ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించేందుకు 2 మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కొనుగోలు చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. ఈ వ్యాన్లు ప్రతినెల రోటేషన్ పద్ధతిలో జిల్లాలకు పంపి లిటరసీ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ జైలు సందర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
News March 15, 2026
పర్చూరు: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన కారు.. 42 గొర్రెలు మృతి

పర్చూరు దేవరపల్లి వద్ద అతివేగంగా వచ్చిన కారు దూసుకెళ్లి 42 గొర్రెలు మృతి చెందగా, 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. తాళ్లూరు, ముండ్లమూరు మండలాల నుంచి వలస వచ్చిన కాపరులకు సుమారు లక్షల్లో నష్టం వాటిల్లింది. రాష్ట్ర సహాయక కార్యదర్శి తిరుపతిరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుపేద కాపరులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
News March 15, 2026
HYD – భద్రాచలానికి బస్సుల వేళలు ఇవే..!

హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ వివిధ బస్సు సర్వీసుల వేళలను క్రమబద్ధీకరించిందని డీఎం జంగయ్య తెలిపారు.
లహరి ఏసీ స్లీపర్.. ఉదయం 8:00, రాత్రి 10:00
రాజధాని ఏసీ.. ఉదయం 7:45; మధ్యాహ్నం 2:10, 3:45, రాత్రి 9:15
సూపర్ లగ్జరీ.. ఉదయం 4:30 నుంచి రాత్రి 11:20 వరకు (మొత్తం 18 సర్వీసులు నడుస్తాయన్నారు). పూర్తి వివరాలకు ఆర్టీసీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.


