News January 26, 2025

NZB: మందకృష్ణకు శుభాకాంక్షలు: MLC కవిత

image

పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన మంద కృష్ణ మాదిగకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తి మంద కృష్ణ అని కొనియాడారు. ఆయనకు పద్మ శ్రీ అవార్డు రావడం సంతోషకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మందకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 25, 2026

NZB: హిందువులపై దాడి చేసిన వారిని శిక్షించాలి: దినేష్ కులాచారి

image

రుద్రూర్, బాన్సువాడ, నిజామాబాద్‌లలో హిందువులపై దాడులు చేస్తున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు జరుగుతున్నాయని, పక్షపాత ధోరణి వీడి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.

News February 25, 2026

ఇందూరు: ఇంటర్ పరీక్షలకు 576 మంది గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 19,150 మంది విద్యార్థులకు 18,574(97%) హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా హైపవర్ కమిటీ, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పర్యవేక్షించారు.

News February 25, 2026

నిజామాబాద్: చెవి నొప్పికి ఆపరేషన్.. యువకుడి మృతి

image

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల భీంగల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ మృతి చెందాడు. చెవి నొప్పితో వచ్చిన అజయ్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తుండగా పరిస్థితి విషమించింది. మత్తు మందు వికటించడం వల్లే అజయ్ చనిపోయాడని, ఆసుపత్రిలో సరైన సౌకర్యం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.