News June 13, 2024
NZB: మధ్యాహ్న భోజన పథకం నిధులు విడుదల

రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి సంబంధించిన మధ్యాహ్న భోజన పథకం నిధులను విడుదల చేసింది. ఒకటి నుంచి 8వ తరగతి కుకింగ్ కాస్ట్ రూ.3.81 కోట్లు, సీసీహెచ్ల వేతనం రూ.78.86 కోట్లు మండలాల వారీగా ఎంఈవో ఎస్ఎన్ఏ అకౌంట్లో జమ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. అలాగే మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు పీఎఫ్ ఎంఎస్ ద్వారా బిల్లులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News November 22, 2025
NZB: ఇద్దరు SIలకు VRకు బదిలీ

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన బదిలీల్లో ఇద్దరు SIలకు VRకు బదిలీ చేసి అంతలోనే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ పేరిట మళ్లీ స్టేషన్లకు అటాచ్ చేశారు. ఇందులో భాగంగా NZBరూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ-1గా పని చేసిన మహమ్మద్ ఆరిఫ్ను డిచ్పల్లి పోలీస్ స్టేషన్కు, నవీపేట ఎస్ఐగా పనిచేస్తున్న వినయ్ను నిజామాబాద్ 6వ టౌన్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 21, 2025
TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

TU పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
News November 21, 2025
NZB: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి: TWJF

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని TWJF నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రాల్లోని విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. దాడుల నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రామచందర్ రెడ్డి, రాజు, పరమేశ్వర్, భాస్కర్, ప్రవీణ్, అనిత తదితరులు పాల్గొన్నారు.


