News July 17, 2024

NZB: మాధవ నగర్ రైల్వే బ్రిడ్జిని పరిశీలించిన: MLA భూపతి రెడ్డి

image

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మాధవ నగర్ రైల్వే బ్రిడ్జిని మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కాంట్రాటర్‌తో మాట్లాడుతూ.. రైల్వే బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని, వాహనా దారులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నీరడి దేవరాజ్, వాసు, కోట్ల భాస్కర్, వెంకట్ రెడ్డి, సాయిలు పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

నిజామాబాద్: బయ్యర్ – సెల్లర్ మీటింగ్‌లో పసుపు బోర్డు ఛైర్మన్

image

మైసూర్‌లో జరిగిన బయ్యర్-సెల్లర్ మీటింగ్‌లో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆశలు, ఆశయాలకు కొత్త దిశ చూపిన హృదయస్పర్శి సమావేశంగా నిలిచిందన్నారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు, భవిష్యత్ మార్కెట్ అవకాశాలపై ఆశతో పెద్ద ఎత్తున హాజరైన రైతులు ఈ సమావేశానికి ప్రాణం పోశారని కొనియాడారు.

News January 8, 2026

NZB: 13 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

image

నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి పట్టుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ES మల్లారెడ్డి తెలిపారు. ADBకి చెందిన పూజ పవర్, డి.బాయి జాదవ్ లు MP లో గంజాయి కొనుగోలు చేసి MH కు చెందిన కిషన్ మోతిరామ్ దాలే, ఇంద్రజిత్ టాగ్రే లను కలుపుకొని, చద్మల్‌కు చెందిన మంజ వెంకట్రాంకు గంజాయిని ఇస్తుండగా CI స్వప్న ఆధ్వర్యంలో పట్టుకున్నామని వివరించారు.

News January 8, 2026

NZB: మున్సిపల్ రిజర్వేషన్లపై ఆశావాహుల ఉత్కంఠత

image

జిల్లాలోని NZB మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీలలో రిజర్వేషన్లపై పోటీ చేసేందుకు సిద్ధమైన ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్ సీట్లు ఏ కేటగిరికి రిజర్వు అవుతాయోనని ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. దామాషా పద్ధతిలో మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వు అవుతుండగా మిగిలిన స్థానాలు ఏ కేటగిరికి రిజర్వ్ అవుతుందోనని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.