News July 17, 2024

NZB: మాధవ నగర్ రైల్వే బ్రిడ్జిని పరిశీలించిన: MLA భూపతి రెడ్డి

image

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మాధవ నగర్ రైల్వే బ్రిడ్జిని మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కాంట్రాటర్‌తో మాట్లాడుతూ.. రైల్వే బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని, వాహనా దారులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నీరడి దేవరాజ్, వాసు, కోట్ల భాస్కర్, వెంకట్ రెడ్డి, సాయిలు పాల్గొన్నారు.

Similar News

News December 18, 2025

మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

image

“రాజీ మార్గమే – రాజ మార్గం” అనే నినాదంతో ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఇదొక సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు. రాజీ పడదగ్గ నేరాలు, సివిల్ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం ఆదా అవుతాయని ఆయన సూచించారు.

News December 18, 2025

నిజామాబాద్: శాంతియుతంగా పూర్తి: సీపీ

image

ప్రజల సంపూర్ణ సహకారంతో గ్రామ పంచాయితీ ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యాయని సీపీ సాయి చైతన్య తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి డిసెంబర్ 17 వరకు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో అన్ని స్థాయిల పోలీసు సిబ్బంది అంకితభావంతో కృషి చేశారని వెల్లడించారు. ప్రజలు-పోలీసుల మధ్య ఉన్న సమన్వయమే ఈ విజయానికి ప్రధాన కారణమన్నారు.

News December 18, 2025

NZB: BJP సర్పంచ్‌లు ఎంతమంది గెలిచారంటే!

image

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 84 మంది సర్పంచులు BJP తరఫున గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 34 మండలాలు, 642 గ్రామ పంచాయతీల్లో BJP మద్దతుదారులు 299 GPల్లో పోటీ చేసి 84 గ్రామ పంచాయతీల్లో గెలిచారు. ఎంపీ అర్వింద్ తమకు అండదండలు ఇవ్వడంతో పాటు గ్రామస్థులు మద్దతు పలికారని గెలిచిన వారన్నారు.