News December 8, 2024
NZB: ముగ్గురు బిడ్డలను అమ్మేసిన కసాయి తల్లి

కన్నతల్లే ముగ్గురు బిడ్డలను అమ్మేసిన ఘటన ఆర్మూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. SHO సత్యనారాయణ వివరాలు.. మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్యి భర్త చనిపోయాడు. దీంతో ఆమె ఇంకో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కన్నది. కాగా మొదటి భర్తకు పుట్టిన ఏడేళ్ల బాబు, ఇద్దరు మగ కవల పిల్లలను రూ.4లక్షలకు ముగ్గురు వ్యక్తులకు విక్రయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెతో పాటు పిల్లలను కొన్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
Similar News
News February 9, 2026
NZB: సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: సీపీ

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీపీ సాయి చైతన్య సూచించారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో సీపీ సోమవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, ఏసీపీ ప్రకాశ్ పాల్గొన్నారు.
News February 9, 2026
NZB: ప్రచార ముగింపుతో పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలు

నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ వరకు గడిచే రెండు రోజులు కీలకంగా మారనున్నాయి. చివరి నిమిషం వరకు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీపై చర్చ సాగుతోంది.
News February 9, 2026
NZB: 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపవచ్చు: కలెక్టర్

ఈ నెల 11న జరగనున్న NZB, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సూచించారు. ఓటర్ కార్డు, ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇలా మొత్తం 18 రకాల గుర్తింపు కార్డులు తమ వెంట తీసుకెళ్లవచ్చన్నారు.


