News March 2, 2025
NZB: మూడిళ్లలో చోరీ.. నిందితుడి అరెస్ట్

తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని నిజామాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శివరాత్రి రోజు గంగస్థాన్ ఫేజ్-2, ఆర్టీసీ కాలనీ, ఏకశిలా నగర్ ప్రాంతాల్లో జరిగిన ఇళ్లలో చోరీల విషయంలో దర్యాప్తు చేయగా సయ్యద్ హమీద్ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిపై 85కు పైగా కేసులు ఉన్నాయి.
Similar News
News March 3, 2025
NZB: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.1983లో ఆయన శాలివాహనగ్రూప్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUSఅభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.
News March 3, 2025
NZB: బాధ్యతలు తీసుకున్న జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి

ఇటీవల జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా నియమించిన IAS అధికారిణి భవాని సోమవారం నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో స్పైసెస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సుందరేశన్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News March 3, 2025
NZB: కొడుకులు, కోడళ్లపై కలెక్టర్కు ఫిర్యాదు

నవీపేట్ మండలం కోసి ఫకీరాబాద్ గ్రామానికి చెందిన గుడ్డి ముత్తమ్మ అనే వృద్ధురాలు కొడుకులు, కోడళ్లు పట్టించుకోవడం లేదని సోమవారం ప్రజావాణిలో నిజామాబాద్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భర్త చనిపోతే అక్కున చేర్చుకుని కడుపు నింపాల్సిన కొడుకులు, కోడళ్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దేవాలయం ఎదుట కూర్చుని యాచిస్తూ జీవనం సాగిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు.