News April 17, 2024

NZB: రికార్డ్‌స్థాయిలో 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

image

రాష్ట్రంలో ఈసారి యాసంగిలో ఇప్పటివరకు రికార్డ్‌స్థాయిలో 2.69లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దేవేంద్రసింగ్ జవాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడుతూ.. అవసరమైతే ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేంద్రంలో సరిపడా టర్పైన్లు, ఇతర సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు.

Similar News

News February 1, 2025

ఆర్మూర్: కేంద్ర మంత్రిని కలిసిన పల్లె గంగారెడ్డి

image

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నేషనల్ టర్మరిక్ బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శనివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. పసుపు బోర్డు ఛైర్మన్ పదవి చేపట్టడానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. పసుపు రైతుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.

News February 1, 2025

NZB:14.5 తులాల బంగారం చోరీ

image

సిరికొండ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య ఇంట్లో 14.5 తులాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని సిరికొండ ఏఎస్ఐ బాల్ సింగ్ తెలిపారు. ఏఎస్ఐ వివరాల ప్రకారం.. సత్తయ్య శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువాను చూడగా బంగారం పోయిందని బాధితుడు వాపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

News February 1, 2025

నవీపేట్: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

నవీపేట్ మండలం ఎంచ గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వినయ్ కుమార్ వివరాల ప్రకారం.. రావుల పెద్దయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నారు. నవీపేట్ సుభాష్ నగర్‌కి చెందిన రెండో భార్య సవిత ప్రతిరోజూ గొడవ పడుతుండేది. ఆమె బంధువులు వచ్చి బెదిరించడంతో గొడవ ఏర్పడింది. దీంతో పెద్దయ్య ఆవేశంలో శుక్రవారం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.