News May 20, 2024

NZB: రూ.వెయ్యి కోట్లు దాటిన పసుపు అమ్మకాలు

image

నిజామాబాద్ జిల్లా పసుపు మార్కెట్‌లో ఈ ఏడు రూ.వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం 36 వేల ఎకరాల నుంచి 25 వేలకు తగ్గినప్పటికి ధర గణణీయంగా పేరిగింది. గతేడాది వరకు క్వింటా నమూనా ధర రూ.6,500కు మించలేదు. అయితే అనూహ్యంగా జులై నుంచి ధర పెరిగి గరిష్ఠంగా రూ.14 వేలు దాటింది. కాగా ఈ సీజన్‌లో 9,59,743 క్వింటాళ్లకు సుమారు రూ.1000.73కోట్లు లావాదేవీలు జరిగాయి.

Similar News

News November 24, 2025

నిజామాబాద్: స్థానిక పోరుకు సిద్ధమా..!

image

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. తాజాగా నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని 31 మండలాల్లోని 545 GPలు, 5022 వార్డులు, 5053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.

News November 23, 2025

NZB: పల్లెల్లో టెన్షన్ టెన్షన్.. రిజర్వేషన్లు మారితే..!

image

గ్రామ పంచాయితీ రిజర్వేషన్లు నేడు ఖరారు కానున్నాయి. మళ్లీ పల్లెల్లో సందడి, టెన్షన్ కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కలతో సర్పంచి స్థానాలకు ఆర్డీవోలు, కులగణనతో వార్డులకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 50 శాతం రిజర్వేషన్లు మించకుండా BC, SC, STలకు కేటాయిస్తారు. ఆపై మహిళలకు 50 శాతం స్థానాలు లక్కీ డ్రా తీస్తారు. రిజర్వేషన్లు మారితే లీడర్లు తమ భార్యలు, తల్లులను బరిలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు.

News November 23, 2025

SRSPకి భారీగా తగ్గిపోయిన ఇన్ ఫ్లో

image

SRSPలోకి ఇన్ ఫ్లో భారీగా తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం తెలిపారు. సరస్వతీ కెనాల్‌కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వదిలామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.