News January 19, 2025
NZB: రూ.382.28 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

నిజామాబాద్ నగరంలో రూ.382.28 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ తాగునీటి సమస్యను తీర్చడానికి అమృత పథకం రూ.217 కోట్లతో నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి నిర్వహణకు రూ.162.81 కోట్లు, రూ.2.47 కోట్లతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన చేశారు.
Similar News
News January 3, 2026
నిజామాబాద్: శాంతి భద్రతలపై పోలీసుల ఫోకస్

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయి చైతన్య కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా జనవరి 1 నుంచి 15 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా విగ్రహ ప్రతిష్ఠలు చేయకూడదన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు DJలు నిషేధించినట్లు చెప్పారు. బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు ఉంటాయని, డ్రోన్లు, భారీ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
News January 3, 2026
NZB: విద్యతో మహిళలకు విముక్తి దీపం: TPCC అధ్యక్షుడు

విద్యతో మహిళలకు విముక్తి దీపం వెలిగించిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి నివాళి అర్పించారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక చరిత్రలో ఆమె చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యమన్నారు. ఆమె సాగించిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
News January 2, 2026
నిజామాబాద్: దొంగల కోసం గాలిస్తున్నాం: SI

నిజామాబాద్ 3 టౌన్ పరిధిలో రైతు బజార్ వద్ద గణేశ్ జువెలరీ షాప్లో నిన్న రాత్రి దుండగులు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని త్రీ టౌన్ SI హరిబాబు తెలిపారు. బ్లూకోట్ కానిస్టేబుల్ షట్టర్ ఓపెన్ ఉండటం గమనించి అటువైపు వెళ్లగా ముగ్గురు దుండగులు పారిపోయరన్నారు. షాపు యజమాని వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


