News January 12, 2025

NZB: రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి

image

నిజామాబాద్‌లో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మోస్రాకు చెందిన పీర్ సింగ్(35) పని నిమిత్తం తన బైక్‌‌పై నిజామాబాద్‌కు వచ్చాడు. వర్ని చౌరస్తా వద్ద ఎదురెదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పీర్ సింగ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఐదో టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 19, 2025

NZB: రేషన్ కార్డు… E-KYCపూర్తి చేసుకోండి: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుదారులు తమ వేలిముద్ర సహాయంతో E-KYC పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో మొత్తం 467295 కార్డుల్లోని 1572176 మంది లబ్దిదారులకు గాను 1103928 (70.22%) లబ్దిదారులు మాత్రమే E-KYC పూర్తిచేసుకున్నారని, మిగతా 468251 (29.78%) లబ్దిదారులు సమీపంలోని తమ రేషన్ షాప్ కు వెళ్లిE-KYC పూర్తిచేసుకోవాలన్నారు.

News December 19, 2025

NZB: కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు రూ. కోటి చెక్కు

image

ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన CCSకానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి చెక్కును పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అందించారు. పోలీస్ సాలరీ ప్యాకేజ్ వర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ క్లెయిమ్ రూపంలో పోలీస్ సాలరీ ప్యాకేజ్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ క్లెయిమ్ రూపంలో ఈ చెక్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ACP రాజా వెంకట్ రెడ్డి, SBI అధికారులు రవి కిరణ్, మహేశ్వర్ పాల్గొన్నారు.

News December 19, 2025

అందరి సహకారంతో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్

image

అందరి సహకారంతో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని NZB జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ పరస్పర సమన్వయంతో కృషి చేసిన ఫలితంగా ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించుకోగలిగామని అన్నారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే తరహాలో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.