News February 5, 2025

NZB: రైలులోంచి పడి వ్యక్తి మృతి

image

రైలులోంచి ప్రమాదవశత్తు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి శివారులో మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న రైల్లోంచి పడి వ్యక్తి మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News September 19, 2025

KNR: మంచి ఫలితాలిస్తున్న FRS.. పెరిగిన అటెండెన్స్..!

image

విద్యార్థులు, టీచర్ల హాజరుశాతం పెంచేందుకు ప్రభుత్వం తెచ్చిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం(FRS) మంచి ఫలితాలనిస్తోంది. దీంతో హాజరుశాతం భారీగా పెరుగుతోంది. 2024 AUG నుంచి దీనిని అమలు చేస్తుండగా JGTLలో 15%, SRCLలో 12%, KNRలో 9%, PDPLలో 2% మేర అటెండెన్స్ పెరిగింది. కాగా, PDPL, KNR టీచర్లు ఈ సిస్టంను లైట్ తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. స్టూడెంట్స్, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తే నాణ్యమైన విద్యకు ఢోకా ఉండదు.

News September 19, 2025

అందుకే నేనింకా పెళ్లి చేసుకోలేదు: అమీషా

image

పెళ్లి తర్వాత వర్క్ చేయొద్దని కండిషన్స్ పెడుతుండటం వల్లే తాను ఇప్పటిదాకా వివాహం చేసుకోలేదని నటి అమీషా పటేల్ వెల్లడించారు. ’50 ఏళ్ల వయసులోనూ నాకు ప్రపోజల్స్ వస్తున్నాయి. నా ఏజ్‌లో సగం వయసున్న వారూ డేట్‌కి రమ్మని అడుగుతుంటారు. సినిమాల్లోకి రాకముందు సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లొద్దనడంతో వదులుకున్నా. సరైన వ్యక్తి దొరికితే పెళ్లికి సిద్ధమే’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు.

News September 19, 2025

బైరెడ్డి హౌస్ అరెస్ట్

image

నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త డా.దారా సుధీర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ‘ఛలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమంలో భాగంగా నంద్యాలకు వెళ్తున్న ఆయనను నందికొట్కూరు డిగ్రీ కాలేజ్ వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులు రోడ్డుపై భైఠాయించి నిరసనకు దిగారు. మరోవైపు వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతానని ఆయన స్పష్టం చేశారు.