News February 5, 2025
NZB: రైలులోంచి పడి వ్యక్తి మృతి

రైలులోంచి ప్రమాదవశత్తు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి శివారులో మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న రైల్లోంచి పడి వ్యక్తి మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News February 20, 2025
ఆధార్ బయోమెట్రిక్ను అప్ డేట్ చేయించాలి: కలెక్టర్

పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ బయోమెట్రిక్ను అప్ డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు.
News February 20, 2025
డ్రంకన్ డ్రైవ్.. ముగ్గురికి జైలు, 15 మందికి జరిమానా

డ్రంకన్ డ్రైవ్ పట్టుబడిన ముగ్గురికి జైలు, 15 మందికి జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ తీర్పు చెప్పారని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన కోటగల్లీకి చెందిన శ్రీనివాస్, ఖిల్లా రోడ్కు చెందిన ఎండీ అఖిల్కు రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారన్నారు. అలాగే 15 మందికి రూ. 36,200 జరిమానా విధించినట్లు వివరించారు.
News February 19, 2025
నిజామాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

➔NZB: పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
➔నిజామాబాద్: ‘నన్ను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా’
➔నిజామాబాద్: పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసం.. ఐదుగురికి రిమాండ్
➔నిజామాబాద్: ఇద్దరి హత్య కేసులో సంచలన తీర్పు: ప్రాసిక్యూటర్ రాజేశ్వర్
➔నిజామాబాద్: పోలింగ్ కేంద్రం వివరాలతో అభ్యర్థుల SMS ప్రచారం