News January 24, 2025
NZB: రైలులో పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత

రైలులో ఓ వ్యక్తి పోగొట్టుకున్న బ్యాగును నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి బాధితుడికి అప్పగించారు. గురువారం తిరుపతి నుంచి వచ్చిన రాయలసీమ రైలులో ఓ వ్యక్తి వ్యక్తికి బ్యాగు పోగొట్టుకున్నాడు. దానిలో రూ.16 వేల నగదు, మూడు గ్రాముల బంగారం, ఒక జత బట్టలు ఉన్నాయి. ఇది చూసిన పోలీసులు విచారణ చేపట్టి బ్యాగును గురువారం యజమానికి అప్పగించారు. నిజాయితీని చాటుకున్న పోలీసులకు సదరు వ్యక్తి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 10, 2025
1,384 మందితో బందోబస్తు: NZB సీపీ

బోధన్ రెవెన్యూ డివిజన్లో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు NZB సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. 1,384 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించాలని సూచించారు. ఎవరైనా గొడవలకు ప్రేరేపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసరాల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
News December 10, 2025
TU: డిగ్రీ పరీక్షలకు 11 మంది గైర్హాజరు

టీయూ పరిధిలోని డిగ్రీ-సీబీసీఎస్- I, III ,V సెమిస్టర్ (రెగ్యులర్), II, IV, VI సెమిస్టర్ (2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్ల) బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి NZB జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్లలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం 18వ రోజు మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 83 మంది విద్యార్థులకు 72 మంది హాజరయ్యారు. 11 మంది గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
News December 10, 2025
NZB: మూడో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడో విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో బుధవారం నిర్వహించారు. కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ చేపట్టారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు.


