News January 9, 2025

NZB: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ నగర శివారులో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌-జాన్కంపేట రైల్వే స్టేషన్ పరిధిలోన బుధవారం సాయంత్రం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి వివరించారు.

Similar News

News January 8, 2026

NZB: మున్సిపల్ రిజర్వేషన్లపై ఆశావాహుల ఉత్కంఠత

image

జిల్లాలోని NZB మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీలలో రిజర్వేషన్లపై పోటీ చేసేందుకు సిద్ధమైన ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్ సీట్లు ఏ కేటగిరికి రిజర్వు అవుతాయోనని ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. దామాషా పద్ధతిలో మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వు అవుతుండగా మిగిలిన స్థానాలు ఏ కేటగిరికి రిజర్వ్ అవుతుందోనని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

News January 8, 2026

హరియాణాలో కామారెడ్డి వాసి దారుణ హత్య

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన కటికే రజనీకాంత్ (40) హరియాణాలో కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఉపాధి నిమిత్తం వెళ్లిన అతడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు హరియాణాకు వెళ్లారు.

News January 8, 2026

NZB: ఎజెండా కమిటీ సభ్యులతో కవిత జూమ్ కాన్ఫరెన్స్

image

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్న ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం-సంపూర్ణ అధ్యయనం’ సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వీరు తమ నివేదికలను ఈనెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదికలు అందజేయాలని సూచించారు.