News August 24, 2025
NZB: విద్యార్థుల కంట్లో కారం చల్లిన టీచర్ సస్పెండ్

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో <<17506407>>విద్యార్థుల కంట్లో కారం<<>> చల్లిన ఉపాధ్యాయుడిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు పాఠశాలలో ఆందోళన చేసి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పందించారు. ఉపాధ్యాయుడు శంకర్పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News September 5, 2025
నల్గొండ జిల్లాలో 15 సంఘాలకు గ్రీన్ సిగ్నల్

NLG జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 14తో PACSల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 42 PACSలు ఉన్నాయి. ప్రస్తుతం PACSల పనితీరు ఆధారంగా 15 సంఘాల పాలకవర్గాల పదవీ కాలాన్ని మాత్రమే పొడిగించారు. మరో 15 సంఘాల పదవీ కాలాన్ని వాటి పనితీరు ఆధారంగా ఉన్నత అధికారుల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు డీసీఓ సిబ్బంది తెలిపారు.
News September 5, 2025
వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సీపీ సమీక్ష

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 6న జరగనున్న గణపతి నిమజ్జన ఏర్పాట్లపై సీపీ సుధీర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజతో పాటు ఇతర ఏసీపీలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
News September 5, 2025
VKB: గణేష్ నిమజ్జన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

గణేశ్ నిమజ్జన వేడుకలకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు సిద్ధం చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. ఈనెల 6న వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నిమజ్జన వేడుకలకు ఏబ్బనూరు చెరువు వద్ద ప్రత్యేకంగా క్రేన్లు, ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లో లైట్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.