News September 17, 2024
NZB: వినాయక నిమజ్జనం.. కావొద్దు విషాదం..!

వినాయక చవితి సందర్భంగా 11 రోజుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడు రేపు గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు. అయితే వినాయకుడికి గంగమ్మ చెంతకు తీసుకెళ్లే క్రమంలో.. చిన్నపాటి నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదకు తెస్తోంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతీ ఏటా ఉమ్మడి NZB జిల్లాలో నిమజ్జనం సమయంలో అపశృతులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటా వినాయక నిమజ్జనం విషాదం కాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ..గణేష్ నిమజ్జనం చేద్దాం.
Similar News
News December 14, 2025
NZB: 11 గంటల వరకు 49.13 శాతం పోలింగ్

రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మొదలైన నాలుగు గంటల్లో ఉదయం 11 గంటల వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 49.13 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
* ధర్పల్లి మండలంలో 53.59%,
* డిచ్నపల్లి-35.36%
* ఇందల్వాయి-50.45%
* జక్రాన్పల్లి-55.16%
* మాక్లూర్-56.25%
* మోపాల్- 55.17%
* NZB రూరల్-60.28%
* సిరికొండ-38.49% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News December 14, 2025
నిజామాబాద్ జిల్లాలో 20.49 శాతం పోలింగ్

రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మొదలైన రెండు గంటల్లో ఉదయం 9 గంటల వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1081WM లకు 20.49 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
*ధర్పల్లి మండలంలో 20.99%,
*డిచ్పల్లి -13.52%
*ఇందల్ వాయి- 19.95%
*జక్రాన్ పల్లి- 23%
*మాక్లూర్-22.31%
*మోపాల్- 19.43%
*NZB రూరల్- 26.69%
*సిరికొండ-23.24% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.
News December 14, 2025
NZB: రెండో విడతకు అధికారులు ఎంత మందో తెలుసా?

NZBజిల్లాలో 2వ విడతలో ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. మొత్తం 2,38,838 మంది ఓటర్లు ఉండగా 1,476 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీవోలు 1,476 మంది, ఓపీవోలు 1937, మైక్రో అబ్జర్వర్లు 56, జోనల్ అధికారులు 34 మంది విధుల్లో ఉంటారు. సిబ్బంది తరలింపునకు 53 రూట్లు కేటాయించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.


