News December 31, 2024

NZB: విషాదం.. రెండంతస్తుల భవనంపై నుంచి పడి మహిళ మృతి

image

బట్టలు ఆరేయడానికి వెళ్లి భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ 4వ టౌన్ పోలీసులు తెలిపారు. బోర్గాం(పి)కి చెందిన కాలూరి నిహారిక (32) దుస్తులు ఆరవేసేందుకు సోమవారం సాయంత్రం రెండంతస్తుల భవనంపైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News October 14, 2025

నిజామాబాద్: సవాలుగా మారిన బంగారం చోరీ కేసు

image

ఇందల్వాయి మండలం లింగాపూర్‌లో దుర్గాదేవి నవరాత్రుల సమయంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అపర్ణ పూజా కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడి 8 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగలు అపహరించారు. సోమవారం బాధితురాలు సీపీ సాయి చైతన్యకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు.

News October 14, 2025

నిజామాబాద్: బాలికలను ఆటపట్టించిన ఇద్దరి అరెస్టు

image

నిజామాబాద్‌లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోటగల్లి వద్ద సోమవారం బాలికలను ఫాలో చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఆకతాయిలను షీ టీం పట్టుకొని తదుపరి చర్యలకు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. బాలికలను, మహిళలను ఎవరైనా వేధిస్తే షీ టీంకు తెలపాలన్నారు.

News October 13, 2025

NZB: బీజేపీ పోరాట ఫలితంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు: దినేష్ కులాచారి

image

బీజేపీ పోరాట ఫలితంగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.