News January 25, 2025

NZB: వృద్ధులను అభినందించిన కలెక్టర్

image

ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న 80 ఏళ్లు పైబడిన వృద్ధులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్లు నాగుల సాయమ్మ, కొట్టూర్ ఇందిరా, అవధూత భూమయ్య, మెరుగు ఒడ్డెమ్మ, అంకం సుశీల, వై.నర్సయ్యలను ఘనంగా సన్మానించారు. కొత్తగా నమోదైన యువ ఓటర్లకు ఐడీ కార్డులను అందజేశారు.

Similar News

News February 16, 2025

NZB: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

NZB, ADB, KNR, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

News February 16, 2025

KMR: అప్పుల బాధ..ఒకే రోజు ఇద్దరి సూసైడ్..!

image

గాల్లో దీపాల్లా..వ్యక్తుల జీవితాలు మారిపోయాయి. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ..ఆ కుటుంబాల్లో పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. కామారెడ్డి జిల్లాలో శనివారం ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇల్లు నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక.. రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లిలో నర్సింలు సూసైడ్ చేసుకోగా..కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక బుడ్మి వాసి జీవన్ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

News February 16, 2025

బాల్కొండ: చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

image

బాల్కొండకు చెందిన జాలరి బట్టు నారాయణ(55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ రోజూలాగే ఉదయం 4 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద చేపల వేటకు నీటిలో దిగాడు. చేపల కోసం పెట్టిన కండ్రిగలో వలలో చిక్కుకుని నీట మునిగి చనిపోయాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని బయటికి తీసి పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆర్మూర్‌కు తరలించారు.

error: Content is protected !!