News April 4, 2025
NZB: సన్న బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి: మంత్రి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సన్న బియ్యం పంపిణీపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు.
Similar News
News October 13, 2025
నిజామాబాద్: అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.
News October 13, 2025
నిజామాబాద్: 8వ జాతీయ పోషణ మాసోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

8వ జాతీయ పోషణ మాసం 2025 సందర్భంగా సోమవారం IDOC సమావేశ మందిరంలో పోషణ మాసానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 16న జరిగే సమావేశం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్దుల శాఖా జిల్లా అధికారిణి రసూల్ బీ పాల్గొన్నారు.
News October 13, 2025
నిజామాబాద్: పోలీసు సిబ్బందికి ఉలెన్ జాకెట్స్ అందజేత

చలికాలం సమీపించిన నేపథ్యంలో విధి నిర్వహణలో పోలీసులకు ఉపయుక్తంగా ఉండే ఉలెన్ జాకెట్స్, హావర్ సాక్స్లను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అందజేశారు. ఈ మేరకు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో ఏఆర్, సివిల్ పోలీసు సిబ్బందికి ఉలెన్ జాకెట్స్ అందజేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ బ్యాంక్ సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి, RSI నిషిత్, సుమన్ పాల్గొన్నారు.