News January 21, 2025

NZB: స్కూలుకు వెళ్లమన్నందుకు ఉరేసుకొని ఆత్మహత్య

image

స్కూలుకు వెళ్లమని తల్లి మందలించడంతో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. మహాలక్ష్మి నగర్‌కు చెందిన దామెర సాక్షిత్ రెడ్డి(14) 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్‌కు సరిగా వెళ్లలేక పోవడంతో ఉదయం తల్లి స్కూల్‌కి వెళ్లాలని మందలించి విధులకు వెళ్లింది. ఇంటికి వచ్చి చూసేసరికి విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 4వ టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 23, 2025

శరీరానికే వైకల్యం.. సంకల్పానికి కాదు: IESలో మానవేంద్ర వండర్!

image

శారీరక వైకల్యం అడ్డువచ్చినా, పట్టుదలతో భారతీయ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) పరీక్షలో 112వ ర్యాంక్ సాధించారు మానవేంద్ర సింగ్. తండ్రి చనిపోయినా, తల్లి రేణు సింగ్ ఇచ్చిన ధైర్యంతో ఈ విజయం అందుకున్నారు UPలోని బులంద్‌షహర్‌కు చెందిన ఈ కుర్రాడు. పట్నాలో బీటెక్ చేస్తుండగానే IES ఆఫీసర్ కావాలని కలలు కన్నారు. ఇప్పుడు అది నిజం కావటంతో కుటుంబ సభ్యులు, ఊరి జనం మానవేంద్రను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

News December 23, 2025

బాపట్ల: అలర్ట్.. షెడ్యూల్ విడుదల..!

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2026 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు CDE సమన్వయకర్త రామచంద్రన్ తెలిపారు. UG, PG 1, 2, 3, 4, 5 సెమిస్టర్ల పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామన్నారు. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.

News December 23, 2025

ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణి సంస్థను తీర్చిదిద్దుతున్నాం: DY.CM

image

ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణి సంస్థను తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మంగళవారం సత్తుపల్లిలో సింగరేణి కాలరీస్ కంపెనీ నూతన జీఎం కార్యాలయ భవనాన్ని సింగరేణి సంస్థ సీఎండీ కృష్ణ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు. సింగరేణి సంస్థ నేడు 45 వేల శాశ్వత ఉద్యోగులు, 40 వేల కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిందని భట్టి పేర్కొన్నారు.