News March 18, 2025
NZB: స్నేహితుడి ఇంట్లో దావత్.. గొడ్డలితో ATTACK

తాగిన మైకంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం గొడ్డలితో వేటు వరకు దారితీసింది. ఈ ఘటన మాక్లూర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కల్లెడ గ్రామానికి చెందిన దేవతి పోశెట్టి అనే వ్యక్తి సోమవారం దుబాయ్ వెళ్లాల్సి ఉండగా, తన స్నేహితుడైన తెడ్డు లింగం ఇంట్లో దావత్ ఇచ్చాడు. దేవతి పోశెట్టి, తెడ్డు లింగం ఇద్దరికి మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో లింగం, పోశెట్టిపై గొడ్డలితో దాడిచేశాడు
Similar News
News February 24, 2026
ఆసిఫాబాద్ కలెక్టరేట్లో ఆకస్మిక తనిఖీలు

ఆసిఫాబాద్ కలెక్టరేట్ భవనంలోని ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ హరిత అకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి సమయపాలనపై అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు విధులకు సమయానికి హాజరవుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
News February 24, 2026
కీరదోసలో పండు ఈగ కట్టడికి విషపు ఎర తయారీ

పండు ఈగ వల్ల పంటలకు కలిగే నష్టం చాలా ఎక్కువ. ఇవి ఆశించిన పంటల కాయలు, పండ్లు కుళ్లిపోయి అమ్మకానికి పనికిరాకుండా పోతాయి. పండు ఈగ నివారణకు విషపు ఎరను తయారు చేసుకోవాలి. దీని కోసం మలాథియాన్ 100ml, 100గ్రా. బెల్లాన్ని 10లీటర్ల నీటిలో కలిపి మట్టి గిన్నెలో పోసి ఎకరాకు 10-12 చోట్ల ఉంచాలి. దీనిలో పులిసిన కల్లు మడ్డి కలిపితే తల్లి పండు ఈగలు మరింత ఎక్కువగా ఆకర్షించబడి ఈ విషపదార్థాన్ని తిని చనిపోతాయి.
News February 24, 2026
₹7లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్.. కానీ!

ఝార్ఖండ్లో ఎయిర్ అంబులెన్స్ <<19222430>>క్రాష్కు<<>> సంబంధించి హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో ఓనర్ సంజయ్ శరీరం 65% కాలిపోయింది. రాంచీలో చికిత్స ఫలితం ఇవ్వకపోవడంతో ఢిల్లీకి తరలించేందుకు కుటుంబసభ్యులు ₹7.5లక్షలు అప్పు చేసి మరీ ఎయిర్ అంబులెన్స్ మాట్లాడారు. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి ఒకరిని కాపాడే ప్రయత్నంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.


