News February 13, 2026
NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్గా పని చేశారు.
Similar News
News March 11, 2026
NZB: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

NZB జిల్లాలో ఈనెల 14 నుంచి SSC పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాటును చేసింది. జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య:24,399
అబ్బాయిలు:12,244,
అమ్మాయిలు:12,155,
పరీక్షా కేంద్రాల సంఖ్య:144
చీఫ్ సూపరింటెండెంట్ల:144
డిపార్ట్మెంటల్ అధికారుల:144
ఇన్విజిలేటర్లు: 1,214 ఉన్నారు. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం
జిల్లా హెల్ప్ లైన్ నంబర్: 9030282993ను ఏర్పాటు చేశారు.
News March 11, 2026
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి: సీపీ సాయి చైతన్య

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పోలీస్ శాఖ అమలు చేయాల్సిన 99 రోజుల కార్యక్రమాలపై సీపీ సాయి చైతన్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బంది కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా గ్రామాలను సందర్శించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు చేరువగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News March 10, 2026
NZB: ఇంటర్ పరీక్షలు.. 377 మంది గైర్హాజరు

NZB జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం భౌతికశాస్త్రం, అర్ధ శాస్త్రం, ఒకేషనల్ పరీక్షలకు 377 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DIEO రవికుమార్ తెలిపారు. మొత్తం 16,678 మంది విద్యార్థులకు గాను 16,301 మంది హాజరయ్యారన్నారు. జనరల్లో 14,305మంది విద్యార్థులకు గాను 13,997 మంది విద్యార్థులు, ఒకేషనల్లో 2,373 మంది విద్యార్థులకు గాను 2,304 మంది పరీక్షలు రాశారు.


