News September 20, 2025

NZB: అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,01,116 విరాళం

image

ఎస్‌జీఎస్ పద్మావతి నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,01,116 PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విరాళం ప్రకటించారు. శనివారం గంగస్థాన్ ఫేజ్-2లోని ఉత్తర తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదన్నారు. దేవుడిని నమ్మే వ్యక్తుల్లో తాను మొదటివాడినని, దేవుని ఆశీస్సులతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.

Similar News

News September 20, 2025

నిజామాబాద్: MLHPలకు ప్రాక్టికల్ పరీక్షలు

image

సీపీసీహెచ్‌లో భాగంగా మెడికల్ ల్యాబ్ హెల్త్ ప్రాక్టీషనర్ (MLHP)లకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది MLHPలు హాజరయ్యారని చెప్పారు. మౌఖిక పరీక్షలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులను కేటాయించినట్లు తెలిపారు. ఎగ్జామినర్‌గా డాక్టర్ నిరూప్ రెడ్డి, ప్రోగ్రాం అధికారిగా డా.రాజు వ్యవహరించారు.

News September 20, 2025

నిజామాబాద్: భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్

image

జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారి పనులకు సంబంధించి జిల్లా వారీగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ అంశాలను చర్చించారు. భూములు కోల్పోయిన రైతులకు అందించాల్సిన పరిహారం, చెల్లింపుల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.

News September 20, 2025

NZB కమీషనరేట్ పరిధిలో పలువురు SIల బదిలీ

image

NZB పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు SIలను బదిలీ చేస్తూ CP సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆర్మూర్‌లో ఉన్న గోవింద్, 4వ టౌన్‌లోని మహేష్, VRలో ఉన్న మహేష్‌ను CCS NZBకు బదిలీ చేశారు. అలాగే VR లోఉన్న వినయ్ కుమార్‌ను ఆర్మూర్‌కు, సాయాగౌడ్‌ను CSB NZB, BBS రాజును కలెక్టరేట్, సామ శ్రీనివాస్‌ను సౌత్ రూరల్ నుంచి NZB రూరల్ ఎస్సై-2గా, మొగులయ్యను ఒకటో టౌన్ నుంచి మాక్లూర్ఎస్సై-2గా బదిలీ చేశారు.