News June 5, 2024

NZB: అప్పుడు 4,80,584, ఇప్పుడు 5,92,318

image

NZBఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో BJP అభ్యర్థి D. అర్వింద్ గెలుపొందారు. 2019లో 70 వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందగా.. ఈ ఎన్నికల్లో ఆ మెజార్టీ 1,09,241కి చేరింది. 2017లో BJPలో చేరిన అర్వింద్ అనతికాలంలోనే అధిష్ఠానం దృష్టిని ఆకర్షించారు. ఏడాదిన్నర కాలంలోనే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో అప్పటి సీఎం కూతురు కవితపై పోటీ చేసి గెలుపొందారు. 2019లో అర్వింద్ కు 4,80,584 ఓట్లు రాగా ఈ సారి 5,92,318 ఓట్లు వచ్చాయి.

Similar News

News February 24, 2026

NZB: గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

image

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల్లో గోదావరిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, భద్రత, రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్ల వివరాలను చూడాలన్నారు.

News February 24, 2026

NZB: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: CP

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని CP సాయి చైతన్య హెచ్చరించారు. సోమవారం ఆయన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో పర్యటించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే అల్లర్లు జరిగితే ఎవరిని ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News February 24, 2026

NZB: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: CP

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని CP సాయి చైతన్య హెచ్చరించారు. సోమవారం ఆయన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో పర్యటించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే అల్లర్లు జరిగితే ఎవరిని ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.