News September 28, 2024
NZB: ఎమ్మెల్సీ కవిత కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని నగరానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఆదే ప్రవీణ్ కుమార్, కోనేటి సాయికుమార్, ఈర్ల శేఖర్ శనివారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా కవిత కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైనా కూడా ఆమె జిల్లాలో కనిపించడం లేదన్నారు. ఆమెను వెతికి జిల్లా ప్రజల ముందు ఉంచాలని కోరారు.
Similar News
News February 28, 2026
నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.
News February 28, 2026
NZB: సౌందర రాజన్ మృతికి కవిత సంతాపం

చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు సౌందర రాజన్ మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కవిత సంతాపం వ్యక్తం చేశారు. సౌందర రాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News February 27, 2026
NZB: సిర్పూర్ శివారులో అస్థిపంజరం లభ్యం

మోపాల్ మండలం సిర్పూర్ శివారులోని గుట్ట వద్ద ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ అస్థిపంజరం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టగా మృతదేహం నెల రోజుల క్రితం గల్లంతైన ఈర్ల సాయిలుగా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


