News October 5, 2025

NZB: ఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు: డీఈఓ

image

పదో తరగతి విద్యార్థుల కోసం సోమవారం నుంచి ఒక గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈఓ అశోక్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. జడ్‌పీ, ప్రభుత్వ పాఠశాలలు, టీజీఎంఎస్, కేజీబీవీల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్‌లు, స్పెషల్ ఆఫీసర్లు అందరూ ఈ ఆదేశాలు పాటించాలన్నారు.

Similar News

News March 6, 2026

టీయూ: ఏఐ యుగంలో విద్య

image

టీయూ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్, టాస్క్ సహకారంతో మార్చి 10, 11వ తేదీల్లో ‘ఏఐ యుగంలో విద్య’ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ అతిక్ సుల్తాన్ గోరి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను రిజిస్ట్రార్ యాదగిరి విడుదల చేశారు. ఏఐ సాంకేతికత ప్రాముఖ్యత, సవాళ్లు, పరిష్కారాలపై చర్చించనున్నారు.

News March 6, 2026

నిజామాబాద్ జిల్లా యువకుడికి సివిల్స్‌లో 259వ ర్యాంక్

image

భీమ్‌గల్ ​మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం వర్షిత్ రెడ్డి UPSC సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 259వ ర్యాంక్ సాధించారు. పట్టుదలతో కష్టపడి ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్న వర్షిత్ రెడ్డిని గ్రామస్థులు, యువత అభినందించారు. జిల్లాకే గర్వకారణంగా నిలిచారన్నారు. తన ప్రతిభతో గ్రామానికి పేరు తెచ్చిన వర్షిత్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు గ్రామస్థులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

News March 6, 2026

NZB: తెలంగాణ ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారు: ఈటెల

image

తెలంగాణ ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ శివారులోని కమ్మ సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేనని అన్నారు. నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు.