News February 18, 2025
NZB: ఎస్ఐని ఢీకొని పరారైన కారు

వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐను ఓ వ్యక్తి కారుతో ఢీకొని పరారైన ఘటన NZBలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి RR చౌరస్తాలో 4వ టౌన్ ఎస్ఐ-2 ఉదయ్ వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఆయణ్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎస్ఐకి గాయాలయ్యాయి. సిబ్బంది ఎస్ఐని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వాహనం ఆపకుండా పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
Similar News
News March 12, 2025
కామారెడ్డి: పదోతరగతి విద్యార్థి సూసైడ్

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక గర్గుల్కు చెందిన పదోవతరగతి విద్యార్థి శరత్ కుమార్ (16) ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శరత్కు క్రికెట్ అంటే ప్రాణమని పైగా విరాట్ కోహ్లికి వీరాభిమాని అని స్థానికులు తెలిపారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీల్లో అనేక అవార్డులను శరత్ సొంతం చేసుకున్నాడు. శరత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 12, 2025
ఆరె కటికల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ మద్దతు: TPCC చీఫ్

ఆరె కటికల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం రాత్రి రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహాసభలో మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆరె కటికలు రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలుగా మారే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. బీసీలకు కాంగ్రెస్ పాలనలోనే సువర్ణ యుగమని, బీసీలు సంఘటితం అయితే భవిష్యత్ తెలంగాణ బీసీలదే అని పేర్కొన్నారు.
News March 12, 2025
NZB: SSC పరీక్షల నిర్వాణపై డీఈఓ పరిచయ కార్యక్రమం

రానున్న SSC పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సన్నద్ధత సహా పలు కీలక అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్తో బుధవారం ఉదయం 7:50 నిమిషాలకు ఆకాశవాణి నిజామాబాద్ (103.2 M.Htz) లేదా “News On AIR” మొబైల్ యాప్ ద్వారా ప్రసారం కానుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్ర ఉద్దేశాన్ని అవగాహన చేసుకొని తగు సూచనలు ఇవ్వాలని డీఈవో అశోక్ కోరారు.