News August 19, 2024

NZB: ఏడాదిలో 934 అఘాయిత్యాలు.. ఇకనైనా మారుదాం..!

image

రాఖీ వచ్చిందంటే చాలు ఎంతదూర ప్రాంతాల్లో ఉన్నా తమ సోదరీమణుల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుంటారు. ‘నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష’ అంటూ ధైర్యం చెప్పుకుంటారు. సమాజంలో ఇతర మహిళల పట్ల సైతం అదే తీరులో సోదరభావంతో మెలిగితే దేశం సురక్షితంగా ఉంటుంది. ఒక్క 2023లోనే నిజామాబాద్ జిల్లాలో 568 మంది, కామారెడ్డిలో 366 మంది అతివలపై అఘాయిత్యాలు జరిగాయి. మరి మనం ఆడపిల్లలకు ఏ మేర రక్షణగా ఉన్నామో ఆలోచించుకోవాలి.

Similar News

News September 18, 2025

TU: RSS ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం

image

తెలంగాణ యూనివర్సిటీ RSS శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో విజయదశమి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య వక్తగా డా.కాపర్తి గురుచరణం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విజయదశమి ఉత్సవమనేది విజయానికి ప్రతీక అన్నారు. అటు RSS 100సం.రాలలో సాధించిన విజయాలను గురించి వివరించారు. కార్యక్రమంలో ఖండ సహా కర్యవహ సంతోష్, సాంగు,మధు,శ్రవణ్, దిగంబర్,రమణ తదితరులున్నారు.

News September 18, 2025

కమ్మర్‌పల్లి: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

image

చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్‌తో మరణించారు. ఈ ఘటన కమ్మర్‌పల్లిలోని గాంధీనగర్‌లో జరిగింది. మృతులు కొండపల్లి లక్ష్మణ్(39), చిత్తారి నర్సు(30)గా పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారి 63 పక్కన ఉన్న చౌటా మోటా కాలువలో చేపలు పడుతుండగా, 11KV హై టెన్షన్ వైర్లు తగిలి ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. లక్ష్మణ్ భార్య సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

News September 17, 2025

NZB: ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది’

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి అన్నారు. NZBలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.