News March 28, 2025

NZB: కల్లులో గడ్డి మందు కలుపుకోని తాగాడు

image

నిజామాబాద్‌లో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వివేకానంద కాలనీకి చెందిన కొత్త రాములు(58) గుమస్తాగా పని చేస్తున్నాడు. సదరు వ్యక్తికి అనారోగ్య సమస్యల కారణంగా ఈనెల 24వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కల్లులో గడ్డి మందు కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు.

Similar News

News March 31, 2025

నిజామాబాద్ జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు: కలెక్టర్

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలోనూ నియమ నిష్ఠలతో దాదాపు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

News March 31, 2025

నిజామాబాద్ జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..

image

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం కోటగిరిలో 41℃, కమ్మరపల్లి, బోధన్, మెండోరా 40.9, పొతంగల్ 40.8, వేల్పూర్ 40.7, సాలూర, ఇందల్వాయి, డిచ్‌పల్లి 40.6, మక్లూర్, ఎడపల్లి, ఆర్మూర్ 40.5, ధర్పల్లి, నిజామాబాద్ 40.4, ముగ్పాల్ 40.4, నందిపేట్ 40.3, రెంజల్, మోస్రా 40.2, బోధన్లో 40.1℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.కాగా ఈ ప్రాంతాలన్నీ ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

News March 30, 2025

NZB: బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పంచాంగ శ్రవణం

image

బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆదివారం పంచాంగ శ్రవణం నిర్వహించారు. జోషి మధుసూదన్ శర్మ విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుందోనని వివరించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్, జాగృతి అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, శంకర్, రామ్ కిషన్ రావు తదితరులతో పాటు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.

error: Content is protected !!