News February 14, 2025

NZB: కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

image

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్‌లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత (59) అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.

Similar News

News March 12, 2025

కామారెడ్డి: పదోతరగతి విద్యార్థి సూసైడ్

image

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక గర్గుల్‌కు చెందిన పదోవతరగతి విద్యార్థి శరత్ కుమార్ (16) ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శరత్‌కు క్రికెట్ అంటే ప్రాణమని పైగా విరాట్ కోహ్లికి వీరాభిమాని అని స్థానికులు తెలిపారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీల్లో అనేక అవార్డులను శరత్ సొంతం చేసుకున్నాడు. శరత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 12, 2025

ఆరె కటికల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ మద్దతు: TPCC చీఫ్

image

ఆరె కటికల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం రాత్రి రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహాసభలో మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆరె కటికలు రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలుగా మారే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. బీసీలకు కాంగ్రెస్ పాలనలోనే సువర్ణ యుగమని, బీసీలు సంఘటితం అయితే భవిష్యత్ తెలంగాణ బీసీలదే అని పేర్కొన్నారు.

News March 12, 2025

NZB: SSC పరీక్షల నిర్వాణపై డీఈఓ పరిచయ కార్యక్రమం

image

రానున్న SSC పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సన్నద్ధత సహా పలు కీలక అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్‌తో బుధవారం ఉదయం 7:50 నిమిషాలకు ఆకాశవాణి నిజామాబాద్ (103.2 M.Htz) లేదా “News On AIR” మొబైల్ యాప్ ద్వారా ప్రసారం కానుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్ర ఉద్దేశాన్ని అవగాహన చేసుకొని తగు సూచనలు ఇవ్వాలని డీఈవో అశోక్ కోరారు.

error: Content is protected !!