News February 14, 2025

NZB: కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

image

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్‌లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత (59) అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.

Similar News

News November 12, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ బూర్గంపాడు రోడ్డు అధ్వానం.. మార్గమధ్యంలో ప్రసవం
✓ పాల్వంచ: ప్రిన్సిపల్ ప్రాక్టికల్ బోధన.. సర్వత్ర విమర్శలు
✓ చర్ల: మనస్థాపానికి గురై ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య
✓ పాల్వంచ పెద్దమ్మ గుడి వద్ద పోలీసుల నాకాబంది
✓ జూలూరుపాడు ఠాణాను తనిఖీ చేసిన ఎస్పీ
✓ జూబ్లీహిల్స్‌లో BRS జెండా ఎగరడం ఖాయం: రేగా
✓ కొత్తగూడెం: దళారులను అరికట్టేందుకే ‘కపాస్ కిసాన్’
✓ దమ్మపేట, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో రేపు పవర్ కట్

News November 12, 2025

NGKL: ‘దర్శన యాత్ర.. ఫోన్ చేయండి!’

image

NGKL డిపో నుంచి అన్నవరం, పంచారామ క్షేత్రాల దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య ‘Way2News’తో తెలిపారు. ఈనెల 14న రాత్రి యాత్ర ప్రారంభం కానుంది. 15న అమరేశ్వరుని దర్శనం, భీమవరం, ద్రాక్షారామం, పంచారామాలు, 16న అన్నవరం వ్రతాలు, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కల్పిస్తారు. 17న తిరుగు ప్రయాణం. ఛార్జీ రూ.3,000. వివరాలకు 94904 11590, 94904 11591 సంప్రదించాలని అన్నారు.

News November 12, 2025

బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

image

డుంబ్రిగూడ మండలం కురిడి వద్ద బైక్ అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని కురిడి రైల్వే గేట్ వద్ద యువకుడు నడుపుతున్న బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.