News June 6, 2024
NZB: కోడలి సజీవదహనం..అత్తకు రెండు జీవిత ఖైదులు

కోడలిని సజీవ దహనం చేసిన అత్తకు 2 జీవిత కారాగార శిక్షలు, రూ. 11వేల జరిమానా విధించింది జిల్లా కోర్టు. నవీపేట మండలం శివతండాకు చెందిన బానోత్ రాంసింగ్ ప్రకాశం జిల్లాకు చెందిన రాధను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాంసింగ్, తల్లి కోడలిని కట్నం తేవాలని వేధించారు. ఈ క్రమంలో 2020 ఏప్రిల్ 20న రాత్రి రాధను రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు.
Similar News
News July 5, 2025
NZB: 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి

బాసర జోన్-2లో పని చేస్తున్న 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి లభించింది. వీరిని నిజామాబాద్ కమిషనరేట్కు అలాట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రియాజుద్దీన్, జక్రయ్య, పరమేశ్వర్, వసంతరావు, అరుణ కుమారి, అనురాధ, రమనేశ్వరి, ముంతాజ్ బేగం, సతీశ్ కుమార్ ASIలుగా పదోన్నతి పొందారు.
News July 5, 2025
డొంకేశ్వర్ మండలం నుంచి 41 మంది IIITకి ఎంపిక

డొంకేశ్వర్ మండలం నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఇందులో డొంకేశ్వర్ ZPHSకు చెందిన 26 మంది విద్యార్థులు ఉండటం విశేషం. 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. తొండాకూర్ ZPHS నుంచి 9, నికాల్పూర్ ZPHS ఐదుగురు, గాదేపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. డొంకేశ్వర్ పాఠశాల హెచ్ఎం సురేశ్, తొండాకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
News July 5, 2025
NZB: వరల్డ్ పోలీస్ గేమ్స్లో బాబాకు మరో బ్రాంజ్ మెడల్

వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ బాబా మరో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అమెరికాలోని అలబామాలో జరుగుతున్న వరల్డ్ పోలీస్ ఆండ్ ఫైర్ గేమ్స్లో భాగంగా 35 ఏళ్ల కేటగిరిలో బాబా 110 మీటర్ల హర్డిల్స్లో అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. 3వ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. అక్కడి భారతీయ అభిమానులు ఆయనను అభినందించారు.