News February 10, 2025

NZB: గత ప్రభుత్వంలో మొద‌లు పెట్టిన ప‌నుల‌ను కొన‌సాగించాలి: కవిత

image

బీఆర్ఎస్ హ‌యాంలో మొద‌లుపెట్టిన అభివృద్ధి ప‌నుల‌ను కొన‌సాగించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కొండ‌గట్టు ఆల‌య అభివృద్ధిని ఆప‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నానన్నారు. బీఆర్ఎస్ హ‌యాంలో మొద‌లుపెట్టిన అభివృద్ధి ప‌నుల‌ను కొన‌సాగించాలని డిమాండ్ చేశారు. కొండ‌గ‌ట్టు రోడ్డు అభివృద్ధి చేయాల‌ని స్థానికులు కోరుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌రమన్నారు.

Similar News

News February 10, 2025

NZB: BRS దుకాణం క్లోజ్: PCC అధ్యక్షుడు

image

తెలంగాణలో BRS దుకాణం క్లోజ్ ఆయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. BRSలో KTR- కవిత-హరీశ్ రావు మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని వ్యాఖ్యానించారు. సోమవారం PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని పశ్నించారు. కులగణన సర్వేలో పాల్గొనని KTR ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదన్నారు.

News February 10, 2025

బాల్కొండ: కాలువలో వ్యక్తి గల్లంతు.. వివరాలు ఇవే!

image

బాల్కొండ మండలం బుస్సాపూర్‌లోని ఇందిరమ్మ కాలువలో పడి <<152100>>వ్యక్తి<<>> గల్లంతయిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బీర్ సింగ్ మారాబి(40) బస్సాపూర్‌లో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కాగా ఆదివారం తన ఫోన్ రిపేర్ చేసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆదివారం నీటిని నిలిపివేశారు.

News February 10, 2025

బాల్కొండ: వరద కాలువలో వ్యక్తి గల్లంతు

image

బాల్కొండ మండలం బుస్సాపూర్ వద్ద ఇందిరమ్మ వరద కాలువలో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వ్యక్తి ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి పోవడంతో నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపి వేశారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మధ్యాహ్నం వరకు 2,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింది.

error: Content is protected !!