News March 6, 2025
NZB: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీల నేతలు అంటున్నారు.
Similar News
News March 6, 2025
చాపాడు: భార్యను గొడ్డలితో నరికిన భర్త

చాపాడు మండలం నక్కలదిన్నె సమీపంలో గురువారం మధ్యాహ్నం భార్యను భర్త యెర్రిబోయిన భాస్కర్ గొడ్డలితో నరికాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్యపై అనుమానంతో భర్త ఈ ఘాతకానికి పాల్పడినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ట్రైనీ డీఎస్పీ భవానీ, ఎస్సై చిన్న పెద్దయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 6, 2025
NZB: ఇంటర్ పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

డిచ్పల్లిలోని రెసిడెన్షియల్ స్కూల్లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులను సందర్శించి, పరీక్షల నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్కు అవకాశం లేకుండా గట్టి నిఘాతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని సూచించారు.
News March 6, 2025
భయం.. భయం: అంతుచిక్కని వ్యాధితో నెలలో 13 మంది మృతి

ఛత్తీస్గఢ్, సుక్మా జిల్లాలోని ధనికోర్టాలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు భయపడుతున్నారు. చెస్ట్ పెయిన్, దగ్గుతో ఇక్కడ నెల రోజుల్లోనే 13 మంది చనిపోయారు. వ్యాధేంటో, దాని కారణాలేంటో తెలియక వైద్యాధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. సీజన్ మారడం, ఇప్పపూల కోసం రోజంతా అడవిలో పనిచేసి డీహైడ్రేషన్తో చనిపోతున్నారని వారు భావిస్తున్నారు. క్యాంపు వేసి ORS ఇస్తూ అవే లక్షణాలున్న బాధితులకు చికిత్స అందిస్తున్నారు.