News February 14, 2025
NZB: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

NZB జిల్లా బాల్కొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. HYDలోని చింతల్కు చెందిన రమేశ్, చంద్రశేఖర్, సాయివిశాల్, శ్రీనివాస్, రజినీకాంత్, సంపత్ కారులో కుంభమేళా వెళ్తున్నారు. చిట్టాపూర్ వద్ద లారీని ఓవర్టేక్ చేస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. సంపత్ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 16, 2025
డిసెంబర్ 16: చరిత్రలో ఈరోజు

* 1912: సినీ దర్శకుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు జననం
* 1949: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి జననం
* 1951: సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభం
* 1971: ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటు
* విజయ్ దివస్ (1971 యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ విజయం)
News December 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 16, 2025
ఉపాధి హామీ శ్రామికులకు రూ.988కోట్లు విడుదల: పెమ్మసాని

AP: ఉపాధి హామీ శ్రామికుల వేతనాల కోసం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.988 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి MGNREGA కింద ఇప్పటి వరకు రూ.7,669 కోట్లు అందాయని చెప్పారు. ఇందులో రూ.5,660 కోట్లు కూలీల వేతనాలకు, రూ.2,009 కోట్లు పనుల సామగ్రి, పరిపాలనా ఖర్చులకు కేటాయించినట్లు ఆయన ట్వీట్ చేశారు.


