News June 9, 2024

NZB: జాతీయ లోక్‌అదాలత్‌లో 17 వేల కేసులు పరిష్కారం

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ద్వారా 17వేల కేసులు పరిష్కారమైనట్లు న్యాయసేవా సంస్థ కార్యదర్శి పద్మావతి తెపారు. 153 సైబర్ క్రైం కేసులు పరిష్కరించి రూ.9 లక్షలు బాధితులకు పోలీసుల ద్వారా అందజేశారు. మోటారు బీమాకు 51 కేసులకు సంబంధించి రూ. 2.18 కోట్ల పరిహారం అందించారు. జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ.. పట్టు విడుపు ధోరణితో కక్షిదారులు కేసులు పరిష్కరించుకోవాలని అన్నారు.

Similar News

News October 3, 2024

కామారెడ్డిలో డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 133 మంది హాజరు

image

డీఎస్సీ-2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొదటిరోజు 133 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. నిన్న అమావాస్య కావడంతో తక్కువ మంది ధ్రువపత్రాల పరిశీలకు వచ్చినట్లు సిబ్బంది వెల్లడించారు. అలాగే ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని అధికారులు సూచించారు.

News October 3, 2024

నిజామాబాద్: కృష్ణా EXPRESSకి 50 ఏళ్లు

image

కృష్ణా EXPRESSకి 50 ఏళ్లు పూర్తయ్యాయి. అక్టోబరు 2, 1974లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకి డీజిల్ ఇంజిన్‌తో లాంఛనంగా ప్రారంభించారు. ఇరు ప్రాంతాల మధ్య కృష్ణా నది ఉండటం వల్లే దానికి ‘కృష్ణాఎక్స్‌ప్రెస్’ అనే పేరును పెట్టారు. అప్పట్లో పగటిపూట నడిచే మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్ రైలు ఇదే. ప్రస్తుతం ADB నుంచి NZB మీదుగా TPT వరకు నడుస్తోంది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌తో మీకున్న అనుబంధం ఎలాంటిదో కామెంట్ చేయండి.

News October 3, 2024

NZB: గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్

image

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం బాసరలో చోటుచేసుకుంది. ఎస్ఐ గణేశ్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన దత్తు (45) ఆరునెలల కిందట ఆయన యాసిడ్ తాగాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.