News January 29, 2025

NZB: జానకం పేట గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్య

image

నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య(60) హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో పడి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 23, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయల్లో పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గతవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.

News February 23, 2026

అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదం: ఫిబ్రవరి 28 నాటికి రిపోర్ట్!

image

అజిత్ పవార్ మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక ఈ నెల 28 లోపు విడుదల కానున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లోపు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండటంతో శనివారానికల్లా వాస్తవాలు బయటకు రానున్నాయి. మరోవైపు ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందంటూ అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ ఆరోపణలు చేయడంతో ఈ రిపోర్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News February 23, 2026

CM కప్‌లో కామారెడ్డి క్రీడాకారుల పతకాల పంట

image

TG ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘CM కప్’ రాష్ట్రస్థాయి పోటీల్లో కామారెడ్డి జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. వివిధ క్రీడా విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు, వెండి, కాంస్య పతకాలతో పాటు నగదు బహుమతులను కైవసం చేసుకున్నారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకటేశ్వర గౌడ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో జిల్లా పేరును నిలబెట్టిన క్రీడాకారులకు, కోచ్ లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అభినందించారు.