News October 7, 2025
NZB జిల్లాలో 33 సైబర్ కేసులు నమోదు: CP

నిజామాబాద్ CCSలో ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 33 సైబర్ కేసులు నమోదు అయ్యాయని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సోమవారం తెలిపారు. బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్, సైబర్ స్లేవ్వరీ తదితర కేసుల్లో 4,92,54,875 రూపాయలు పోగొట్టుకోగా రూ.87,29,839 రికవరీ అయ్యాయన్నారు. కాగా ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన వాటిని మాత్రమే నమ్మే విధంగా ఉండాలని ప్రజలకు సీపీ సూచించారు.
Similar News
News October 7, 2025
NZB: వైన్స్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

NZB జిల్లాలోని 102 వైన్ షాప్లకు గాను 24 షాప్లకు సంబంధించి సోమవారం వరకు 35 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. NZB ఫరిధిలోని మొత్తం 36 వైన్ షాపుల్లో 11 షాప్లకు 18 దరఖాస్తులు, BDN- మొత్తం18 వైన్ షాపుల్లో 4 షాప్లకు 5, ARMR- 25 షాపుల్లో 4 షాప్లకు 5, భీంగల్-12 వైన్ షాపుల్లో 3 షాపులకు 4, మోర్తాడ్ పరిధిలో 11 వైన్ షాపుల్లో 2 షాపులకు 3 దరఖాస్తులు వచ్చాయన్నారు.
News October 7, 2025
NZB: ‘సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోండి’

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2 ఏళ్ల కాలపరిమితికి సంబంధించి DMLT, డిప్లొమా ఇన్ డయాలసిస్ కోర్సుల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.కృష్ణ మోహన్ సూచించారు. ఈనెల 8 నుంచి 28 వరకు కళాశాలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. DMLTలో 30, డిప్లొమా ఇన్ డయాలసిస్ కోర్సులో 10 సీట్లు ఉన్నట్టు తెలిపారు.
News October 6, 2025
ఎడపల్లి: బంగారం కోసం మహిళ హత్య.. ఇద్దరి అరెస్టు

దూరపు బంధువైన మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న కేసులో ఎడపల్లి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచే రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ను ఛేదించి నిందితుడైన జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి బాలకృష్ణ (36)ను, కొండపాక లక్ష్మయ్య (55)లను అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు.